Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ఆ నిజం తెలిసిపోయిందా!
on Mar 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1037 లో.. మనుని తన దగ్గర నుండి వెళ్ళమని అనుపమ చెప్తుంది. అప్పుడే వసుధార, మహేంద్రలు వచ్చి.. ఎక్కడికి వెళ్తాడు. ఇక్కడే ఉంటాడు. పదండీ భోజనం చేద్దామని మహేంద్ర అనగా.. నేను రానని అనుపమ అంటుంది. దాంతో నేను ఉంటే మేడమ్ భోజనం చేయరు, నేను వెళ్తానని మను అంటాడు.. మను ఉంటే భోజనం చేయవా అని అనుపమని మహేంద్ర అడుగుతాడు. అనుపమ సైలెంట్ గా ఉంటుంది. మౌనం అంగీకారం మను ఉంటే మేడమ్ కి ఏం ప్రాబ్లెమ్ లేదు.. మేడమ్ మీరు ఫ్రెష్ అయి రండి అని వసుధార చెప్తుంది..
ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరు వస్తారు. అనుపమ పక్కనే మనుని కూర్చొపెట్టాలని ఏంజిల్ ప్లాన్ చేస్తుంది. మను కూర్చొబోతుంటే.. అది నా ఫేవరేట్ ప్లేస్ మీరు అత్తయ్య పక్కన కుర్చోండి అని ఏంజిల్ చెప్తుంది. ఆ తర్వాత అందరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. అందరం ఇక్కడే ఉన్నాము కదా ఒక సెల్ఫీ తీసుకుందామని ఏంజిల్ అనగానే.. వద్దని అనుపమ అంటుంది. ఆయిన ఏంజిల్ వినకుండా సెల్ఫీ తీస్తుంది. ఆ తర్వాత ఈ ఫొటోస్ అన్ని మీకు పంపిస్తానని మనుకి ఏంజిల్ చెప్తుంది. ఇక నేను వెళ్తానని మను అంటుంటే.. ఈ ఒక్కరోజు ఉండు నీకు ఎప్పుడు రావాలి అనిపించినా వచ్చేయ్ ఎవరికీ బయపడాల్సిన అవసరం లేదని మహేంద్ర అంటాడు.
ఆ తర్వాత మను వెళ్తు వసుధార ఫోన్ చేసి మాట్లాడాలన్న విషయం గుర్తుకు వచ్చి.. వెనక్కి వచ్చి ఏం మాట్లాడాలని అడుగుతాడు. మీరు ఏ తప్పు చెయ్యలేదని తెలిసింది కదా కాలేజీకి రండి అని వసుధార అనగానే.. " మీరు పొమ్మనగానే వెళ్లిపోయి, రమ్మనగానే రాలేను.. అనుపమ గారు రావద్దని చెప్పారు తన మాట తీసేయ్యలేను" అని మను చెప్పి వెళ్లిపోతాడు. మను మాటలు అనుపమ, ఏంజిల్ వింటారు. మరొకవైపు అనుపమ, మనుల మధ్య గొడవ నాకు అర్థం అయింది. మను తండ్రి గురించి అడిగాడనుకుంటా.. అనుపమ అతనేవరో చెప్పలేకపోతుందని శైలేంద్రతో దేవయాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
Also Read